Thursday, April 18, 2024

ఏజెన్సీలో గంజాయి సాగు.. పోలీలసు తీరుపై ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ లేఖ

విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసుల తీరు ఎండగడుతూ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. ఏజెన్సీలో మావోయిస్టులు గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయితో షావుకార్లు, దళారులు, పోలీసులు మాత్రమే బాగుపడతారని అన్నారు. గతంలో ముంచుంగిపుట్టు ఎస్ఐ అరుణ్ కుమార్, పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ గంజాయ్ వ్యాపారం చేస్తూ లక్షల సంపాదనతో లబ్ది పొందారని ఆరోపించారు. అదే విధంగా దుంబ్రిగూడ ఎస్ఐ తమ పరిధిలో ఉన్న పంచాయతీ గ్రామాల్లో గంజాయి సాగు చేయించిన సంగతి అందరికీ తెలిసిందే అని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే కిదారి ఘటన వెనుక దుంబ్రి గూడ పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడానికి ఇదే కారణం అని తెలిపారు. గంజాయి సాగు విషయంలో సీఐ, సీఐల నుంచి పై అధికారుల వరకూ బాగుపడుతున్నారని చెప్పారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సాగును అరికట్టాలని ఉద్దేశంతో పరివర్తన పేరిట ఆదివాసి గ్రామాలపై పోలీసుల దాడులను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement