Tuesday, April 23, 2024

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం.. సీఎం జగన్

మన సంస్కృతిని, మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను, విజయాలను, ఈ నేలపై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అని సీఎం జగన్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం అని ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement