Thursday, April 18, 2024

రామసముద్రం వద్ద చిరుత కలకలం

పుంగనూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మూగవాడి కొత్తూరు కౌండన్య నది కాలువ సమీపంలో చిరుతపులి సంచారం గ్రామస్తుల్లో కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై పుంగనూరుకు వెళుతుండగా, చిరుతపులి రోడ్డు దాటుతున్న విషయాన్ని గ్రామస్తులకు తెలియ పరిచారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలియ జేయడంతో అటవీశాఖ అధికారి కిరణ్ కుమార్ చిరుతపులి పాదముద్రలు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement