Thursday, April 18, 2024

Karnool: సిద్దాపురం చెరువుకు గండి

కర్నూలు జిల్లాలోని ఆత్మకురు మండలంలోని సిద్దాపురం చెరువుకు గండి పడింది. స్థానికుల ఫిర్యాదుతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు… తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా గండి ద్వారా నీరు లీకేజీ అవుతోంది. దీంతో నీటి ఉధృతిని తగ్గించేందుకు అధికారులు అలుగు కొట్టి ఫారెస్టులోకి నీటి విడుదల చేశారు. ప్రస్తుతం సిద్దాపురం చెరువులో 19 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నీరు వృధాగా బయటకు వదులుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement