Thursday, April 25, 2024

గుంటూరులో మట్టిపెళ్లలు కూలిన ఘటన : సూపర్‌వైజర్ సస్పెన్షన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు శివారులోని అమరావతి రోడ్డులో మల్టీప్లెక్స్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు ఈరోజు మట్టిపెళ్లలు విరిగి ముగ్గురు మృతి చెందిన సంఘటన విధిత‌మే. ఈ ఘ‌ట‌న‌పై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టిని సారించారు. నగరపాలక సంస్థ చర్యలు ప్రారంభించింది. పట్టణ ప్రణాళికా విభాగం సూపర్‌వైజర్‌ సత్యనారాయణను సస్పెన్షన్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన గుత్తేదారు సంస్థపైనా చర్యలు తీసుకోవాలని, సైట్‌ఇంజినీర్‌ , బిల్డర్‌పై కేసు నమోదు చేయాలని కమిషనర్‌ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement