Friday, April 26, 2024

వైసీపీ నేతల్లారా… చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు.. చంద్ర‌బాబు

వైసీపీ నేతల్లారా.. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు.కర్నూలు జిల్లాలోని ఆదోనిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఆర్థిక అక్రమార్కుల ఆట కట్టించాలన్నారు. పిల్లల భవిష్యత్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అర‌ చేతిని అడ్డం పెట్టి సూర్యరశ్మిని అడ్డుకోలేరని తెలిపారు.

రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. అన్నింటిపైనా చార్జీల మోత మోగిస్తున్నారని, ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు చరమగీతం పాడాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement