Thursday, April 25, 2024

వామ్మో చిరుత‌… నంద్యాల జిల్లాలో సంచారం..

నంద్యాల జిల్లాలోని గడివేముల మండలం ఒండుట్ల, గని గ్రామాల మధ్య చిరుత పులి సంచారం కలకలం రేగింది. తురికొనికుంట వద్ద పత్తి పొలంలో పులి తిరుగుతోంది. దీంతో అటవీశాఖ అధికారులు పరిసరాలను పరిశీలించారు. పులి అడుగుజాడలను గుర్తించారు. పది రోజులుగా గ్రామస్తులను చిరుత భయభ్రాంతుకు గురి చేస్తోంది. గ్రామస్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. చిరుతను బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement