Thursday, March 28, 2024

క్రీడలతో సమాజ శ్రేయస్సుకు ఉపయోగం : మాజీ ఎంపీ టీజీ వెంకటేష్

కర్నూల్ : నిత్యం విద్యార్థులు క్రీడా సాధన చేసి పతాకాలు సాధించి తద్వారా సమాజ శ్రేయస్ కు ఉపకారం చేస్తారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. శనివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా క్రీడల్లో సాధన చేసి తల్లిదండ్రులకు, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. మీకు పేరు వస్తే మాకు గుర్తింపునిచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. క్రీడా రంగాన్ని ప్రభుత్వం మరింత ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. తాము పదవిలో ఉన్నా.. లేకున్నా క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అత్తిలిటీకి అసోసియేషన్ కార్యదర్శి సి హర్షవర్ధన్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు. అతనెటిక్స్ ప్రతినిధులు ఓబన్న తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనిఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement