Saturday, April 20, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి…

నంద్యాల జిల్లా బనగానపల్లెలోని పలుకూరు-చెరువుపల్లె సమీపంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెంద‌గా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పలుకూరుకు చెందిన తండ్రీకొడుకులుగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. పోస్టుమార్టం నిమిత్తం మృ‌తదేహాలను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement