Thursday, March 28, 2024

ఆ వార్తల్లో నిజం లేదు : గుమ్మ‌నూరు జ‌య‌రాం

తాను భూములను ఆక్రమించుకున్న‌ట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కొందరు కావాలనే తనపై కుట్రపూరితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటినా కంపెనీ నుంచి వంద ఎకరాలు కొన్నది వాస్తవమేనని మంత్రి జయరాం అన్నారు. ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పారు. తాను ఎవరి భూములను ఆక్రమించుకోలేదని తెలిపారు. కొన్న భూములను రైతులకే రిజిస్ట్రేషన్ చేయిస్తానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement