Tuesday, April 23, 2024

విద్యార్థులు చదువుతోపాటు దేశభక్తిని అలవర్చుకోవాలి : టీజీ వెంకటేష్

కర్నూలు : విద్యార్థులు చిన్నతనం నుండే విద్యా బుద్ధులతోపాటు దేశభక్తిని కూడా అలవర్చుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక ఏ క్యాంప్ మాంటిస్సోరి స్కూల్ నందు ఆజాది క అమృత మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగ ఫలంతోనే స్వాతంత్రం సిద్ధించిందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వారందరినీ స్మరించుకోవడానికి ప్రధాని మోడీ అమృత మ‌వోత్సవాలు ఏర్పాటు చేశారన్నారు. ఇటువంటి ఉత్సవాలతో మహనీయులను స్మరించుకోవడంతోపాటు, వారి బాటలో నడవాలి అన్న స్ఫూర్తిని కూడా విద్యార్థుల్లో నింపుతుందని టీజీ అన్నారు. అనంతరం ఆయన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతూ విద్యార్థులు అందరూ స్వాతంత్ర సమరం గురించి, స్వాతంత్ర దినోత్సవం గురించి, అలాగే గణతంత్ర దినోత్సవం గురించి క్లుప్తంగా వ్యాసాలు రాయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement