Thursday, March 28, 2024

అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం..

ఆర్టీసీ లగ్జరీ బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్‌జిల్లాలోని జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ప్రమాద వశాత్తు దగ్ధమయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ లగ్జరీ బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్‌ వస్తున్నది. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద బస్సులో షార్ట్‌సర్య్కూట్‌ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలను గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు అందరినీ బస్సులో నుంచి దించివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement