Tuesday, April 16, 2024

Velugodu: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో వెలుగోడు వాసుల దుర్మరణం

వెలుగోడు, జూన్ 6 (ప్రభ న్యూస్) : కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారందరూ నంద్యాల జిల్లా వెలుగోడు, బండి ఆత్మకూరు మండలాలకు చెందిన వారు ఉన్నారు. బాధితులందరూ కర్ణాటక రాష్ట్రంలోని కలుబుగిరి దర్గాలో ఉరుసు జాతరకు వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో మండల కేంద్రమైన వెలుగోడు, బండి ఆత్మకూరులో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈ ప్రమాదంలో వెలుగోడు గ్రామానికి చెందిన రమీజాబి (50) మృతి చెందగా, ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరొకరు న్యాయమతున్ (40) మృతిచెందగా, ఈమెకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అదేవిధంగా మాసూమ్ కూతురు సుమియా (12) మృతి చెందింది.

దీంతో కుటుంబ సభ్యులందరూ ఘటన స్థలానికి తరలివెళ్లారు. దీంతో వారి బంధువులు వెలుగోడు చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో వారితో పాటు వారి సమీప బంధువులు వెలుగోడు, బండి ఆత్మకూరు మండలానికి చెందిన వారు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను అక్కడి స్థానికులు, పోలీసులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరందరూ బంధువులు కావడంతో అందరు కలిసి తూఫాన్ వాహనంలో సోమవారం సాయంత్రం 6:30 గంటలకు వెలుగోడు పట్టణం నుండి బయలుదేరి దైవ దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తెల్లవారు జామునే వారి మరణ వార్త అందరినీ కలిచి వేసింది. ఇప్పటికే క్షతగాత్రులందరినీ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వచ్చి వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement