Wednesday, April 24, 2024

పురుగు మందు తాగి గ‌ర్భిణి ఆత్మ‌హ‌త్య‌

కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తాయమ్మ అనే గర్భిణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తాయమ్మతో రెండేళ్ల క్రితం నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఆమె గర్భిణీ అయ్యాక వివాహం చేసుకోవాలని కోరింది. ఆయన పెళ్లికి నిరాకరించడంతో మన స్థాపానికి గురైన తాయమ్మ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement