Saturday, April 20, 2024

అవినాష్ అరెస్టుకు ప్లాన్ బీ రెడీ… రంగంలోకి కేంద్ర బ‌ల‌గాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ ప్లాన్ బీ ని రెడీ చేసుకుంటోంది. దీంతో కేంద్ర బ‌ల‌గాలు హైదరాబాదు నుండి కర్నూలుకు చేరుకుంటున్నాయి.వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు కేంద్ర బలగాలను వినియోగించుకోవాలని ఢిల్లీ సీబీఐ అధికారులు సూచించారు. దీంతో అవినాష్ రెడ్డికి అన్ని దారులూ మూసుకుపోయాయి. ఏ క్షణంలో అయినా అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే విశ్వభారతి ఆసుపత్రి వద్ద ఉత్కంఠ‌ కొనసాగుతోంది. ఆసుపత్రి ఎదుట మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement