Wednesday, April 24, 2024

డ‌యారియా మృతుల కుటుంబాలకు మూడు లక్షల ఆర్థిక సహాయం … పేర్ని నాని

ఆదోని టౌన్ …అతిసార వ్యాధితో మృతి చెందిన కుటుంబీకులకు తక్షణ సహాయం మూడు లక్షల అందజేయడం జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు శుక్రవారం కర్నూలు జిల్లాలోని ఆదోనిలో అతిసార గురైన అరుణ్ జ్యోతి నగర్ లోకార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంఎంపీ సంజీవ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కలెక్టర్ వీర పాండ్యన్ తో కలిసి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు అరుణ్ జ్యోతి నగర్ లో వారం రోజుల పాటు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు అలాగే కోటి రూపాయలతో కలుషిత నీటి సరఫరా కాకుండా ప్రత్యేక పైప్ లైన్ వేయించడం జరుగుతుందన్నారుడాక్టర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వాలంటీర్ల ద్వారా మూడు టీంలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వెళ్లి అతిసార బాధితులను సర్వే చేయడం జరుగుతుందన్నారు అలాగే ప్రతి వంద కుటుంబాలకు ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు అర్బన్ హెల్త్ సెంటర్ ల ముందు రెండో 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు అతిసార వల్ల ఎలాంటి మరణాలుజరగకుండా ముందు జాగ్రత్తగా వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement