Thursday, March 28, 2024

ప్రజా సంక్షేమానికి పెద్దపేట : మంత్రి గుమ్మనూరు జయరాం

ఆలూరు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేశామని, నవరత్నాల ద్వారా ప్రతి గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ సందర్భంగా గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని హాలహర్వి మండలం కామినహాలు గ్రామం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మావతి ఆధ్వర్యంలో ఆసేని, హుసేని, దస్తగిరి స్వామి వార్లను, మారమ్మ, దేవమ్మ దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామనికి బడి పిల్లల సౌకర్యార్థం బస్సు సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగప్ప, ఎంపీపీ నేటే కంటమ్మ, సర్పంచులు బాలరాజు, నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement