Saturday, April 20, 2024

పిల్ల‌ల‌తో క‌లిసి బావిలోకి దూకిన త‌ల్లి : ఇద్ద‌రు పిల్ల‌లు మృతి

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లి బావిలోకి దూక‌డంతో ఇద్ద‌రు పిల్ల‌లు మృతిచెంద‌గా, త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు మండలం పూలతోటలో ఈ విషాద ఘటన కలిచివేసింది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో ఇద్దరి పిల్లలు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలతో క‌లిసి త‌ల్లి బావిలోకి దూకిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ పిల్లలు మృతి చెందగా, తల్లిని బయటకు తీశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement