Tuesday, April 23, 2024

మినీ బస్సు బోల్తా.. 10మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలు

మినీ బస్సు బోల్తాపడడంతో 10మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అయ్యప్ప భక్తుల బృందం మినీ బస్సులో శబరిమలైకి వెళ్తుండగా నంద్యాల జిల్లా దీబగుంట వద్ద బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న అయ్యప్ప భక్తుల్లో పది మందికి గాయాలు కావడంతో వారిని హుటాహుటినా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement