Thursday, April 25, 2024

రామ‌గోపాల్ రెడ్డిని గెలిపించండి.. చంద్రబాబు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రామ‌గోపాల్ రెడ్డిని గెలిపించాలని మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కర్నూలు యువతని కోరారు. క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తీవ్ర విమర్శలు ఒప్పించారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేరులో వెళుతుందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికీ ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఈ విషయంలో త‌నకంటే చెప్పేవాడు కానీ, చేసేవాడు కానీ ఎవరూ లేరన్నారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల కోట ఎన్నికలలో వైయస్ఆర్సీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ తరఫున భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో రామ‌గోపాల్ రెడ్డి ని గెలిపించాలని చంద్రబాబు కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement