Thursday, April 18, 2024

పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగుదాం : మంత్రి జయరాం

ఆలూరు : పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పని చేయాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని హోలగుంద మండలం గజ్జహల్లి గ్రామమునందు సర్పంచ్ నాగమ్మ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నూతన సచివాలయ కార్యాలయాన్ని ఆర్బికే, చెత్త సేకరణ తదితర వాటిని ప్రారంభించారు. గ్రామానికి దాదాపు 12 కోట్లు ఇప్పటివరకు అందజేసినట్లు తెలిపారు. ఆలూరు నియోజకవర్గం అబ్జర్వర్ మలికి వెంకటరెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి నారాయణస్వామి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement