Friday, April 19, 2024

కలియుగ రాక్షసులు నారా చంద్రబాబు, నారా లోకేష్ : మంత్రి గుమ్మనూరు జయరాం

ఆలూరు : కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్ అని, రాష్ట్రంలో కొందరిని సుర్పణకలను తయారుచేసి వాడుకుంటున్నార‌ని మంత్రి గుమ్మనూరు జయరాం మండిప‌డ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం విలేకరుల సమావేశం నిర్వ‌హించారు. గోరంట్ల మాధవ్ వీడియో అనంతపురం ఎస్పీ విచారణలో వాస్తవం లేదని తేలింద‌న్నారు. చంద్రబాబు అమ్మాయిలను రాజకీయంగా వాడుకోవడం తెలుసు తప్ప ఆదుకోవడం తెలియద‌న్నారు. నవరత్నాల ద్వారా ఏ గడపకు వెళ్లిన ప్రభుత్వంపై అనుకూలంగా స్పందిస్తారని తెలిపారు. తెలుగు దేశం పార్టీ బీసీల వ్యతిరేక పార్టీకి మారిపోయింది అని తెలిపారు. వైసీపీకి బీసీలను దూరం చేసేందుకే టీడీపీ కుట్రలు పన్నుతున్నారని అని అన్నారు. ఫేక్ వీడియోలతో ఎంపీ గోరంట్ల మాధవ్ పై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. వైసీపీకి బీసీలు మద్దతు పెరగడంతో భరించలేని టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి సొసైటీ చైర్మన్ గోవర్ధన్, ఆలూరు మండల కన్వీనర్ వీరేష్, కో కన్వీనర్ అనుమయ్య, ఆస్పరి ఎంపీపీ భర్త రామాంజనేయులు, ఎంపీపీ తనయుడు దీపక్, మర్కట్ మాజీ సర్పంచ్ ఎల్లప్ప, తదితర వైఎస్ఆర్సిపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement