Thursday, April 25, 2024

భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి..

కర్నూలు : భార్యకు తెలియకుండా ఓ భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని మూగలదొడ్డికి చెందిన ఈడిగా విజయలక్ష్మికి కళ్ళకుంటకు చెందిన ఈడిగ నరేష్ గౌడ్ తో 2017 లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కాగా గత జనవరి 26వ తేదీన రాయచూరు జిల్లా పోతుగల్లుకు చెందిన మరో యువతిని తనకు తెలియకుండా వివాహం చేసుకున్నట్లు విజయలక్ష్మి కోస్గి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement