Wednesday, April 24, 2024

క‌ర్నూల్ లో మాన‌వ‌హారం.. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం..

క‌ర్నూల్ రాజ్ వీహార్ లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మేయర్ బీ.వై. రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, ఎంపి సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవింద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమ‌న్నారు. ఈ సంద‌ర్భంగా హోరెత్తించిన వికేంద్రీకరణ నినాదాలు. మాన‌వ‌హారంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యా సంస్థల అధినేతలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, యువకులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement