Friday, April 19, 2024

అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి చేయూత: మంత్రి జయరాం

ఆలూరు : అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి రెండు లక్షలు రూపాయలు ఆలయ కమిటీ చైర్మన్ వైకుంఠ మల్లికార్జున కి కార్మిక శాఖ మంత్రి జయరాం అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయం నందు అయ్యప్ప స్వామి కమిటీ సభ్యులు అభ్యర్థన మేరకు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణస్వామి గుమ్మనూరు ఈశ్వర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ని కప్పి సన్మానించారు. అనంతరం పెద్ద హోతూరు గ్రామం నందు ఉచ్చిరప్ప తాత గోపురం నిర్మాణానికి రెండు లక్షల 50 వేలు అందజేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement