Friday, March 29, 2024

ప్ర‌జా సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : మంత్రి గుమ్మనూరు జయరాం

ఆలూరు : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామంలో అభివృద్ధి ఫ‌లాలు అందించడానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్పంచ్ సుశీలమ్మ అధ్యక్షతన నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పూలమాల, శాలువాత సన్మానంతో గ్రామంలోనికి ఆహ్వానించారు. అనంతరం సుంకులమ్మ దేవాలయం, ఆంజనేయ దేవాలయంలో సుంకులమ్మ దేవి, వినాయక విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిష్టాపన సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం 10 లక్షలతో నిర్మించునున్న సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఒక కోటి 87 లక్షలు ఇప్పటివరకు అందించమని తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపగడప సంక్షేమ ఫలాలను వివరిస్తూ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement