Thursday, April 25, 2024

శ్రీశైలం జలాశయానికి తగ్గిపోయిన వరద

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శ్రైశైలం జలాశయంలోకి వరద నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఔట్ ఫ్లో మాత్రం 21,189గా ఉంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 820 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిలువ కెపాసిటీ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40.8748 టీఎంసీల నీరు ఉంది. తెలంగాణ పరిధిలో ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా ఏపీ పరిధిలోని కుడిగట్టులో మాత్రం విద్యుదుత్పత్తి ప్రారంభం కాలేదు. మరోవైపు నేటి నుంచి జలాశయం పైకి సందర్శకులను అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ వద్ద రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు మోహరించారు.

ఇది కూడా చదవండి: పులిచింతల వద్ద భారీగా మోహరించిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement