Saturday, April 20, 2024

రక్తదానం ప్రాణదానంతో సమానం : టీజీ భరత్

కర్నూల్ : ర‌క్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడటం గొప్ప విషయమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి టిజి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని మౌర్య ఇన్ లో హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకడం చాలా కష్టంగా మారిందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేస్తూ ఉండాలన్నారు. ఇక హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేయడం ఎంతో మంచి కార్యక్రమం అన్నారు. కార్పోరేట్ సంస్థలు ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతం అయ్యేందుకు పూర్తి స్థాయిలో కష్టపడతాయని అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన బ్యాంకు సిబ్బందికి పండ్లు, పండ్లరసాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు టి.జి భరత్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు ఉమేష్ కుమార్, శిరీష్ కల్యాణ్, గౌస్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement