Saturday, April 20, 2024

అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి నాంది : మంత్రి గుమ్మనూరు జయరాం

ఆలూరు : అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని హాలగుంద మండలం సులువాయి గ్రామం నందు పాఠశాలలో నాడు నేడు ద్వారా దాదాపు రెండు కోట్లతో 13 గదులు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం హోలగుంద ఆర్బికే మూడును సర్పంచ్ తనయుడు పంపపతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. సచివాలయం వ్యవస్థ ప్రారంభంన నుండి ఇప్పటివరకు దాదాపు 20 కోట్లు అందజేసినట్లు తెలిపారు. నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సచివాలయం మూడు నందు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా ఇన్చార్జి నారాయణస్వామి, నాయకులు ప్రభుత్వ అధికారులు , పోలీస్ సిబ్బంది, తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement