Friday, March 29, 2024

ఓర్వ‌క‌ల్లు ఎయిర్ పోర్ట్ ను ప‌రిశీలించిన జిల్లా కలెక్ట‌ర్..

కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసుల‌ను ఈ నెల 25న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు.. అదే రోజున ఎయిర్ పోర్ట్ ను ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు జ‌గ‌న్.. ఇక ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ నెల 28 నుంచి రెగ్యుల‌ర్ విమాన స‌ర్వీస్ లు ప్రారంభం కానున్నాయి.. తొలిద‌శ‌లో బెంగుళూరు, చెన్నై, విశాఖ‌ప‌ట్నానికి విమాన స‌ర్వీస్ లు ఇక్క‌డి నుంచి న‌డ‌ప‌నున్నారు…అలాగే ఆన్ లైన్ టిక్కెట్ అమ్మ‌కాల‌ను కూడా ఇప్ప‌టికే ఆయా విమాన సంస్థ‌లు ప్రారంభించాయి.. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై జిల్లా క‌లెక్ట‌ర్ వీర‌పాండియ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు.. అలాగే ఓర్వ‌క‌ల్లు విమానాశ్రయాన్ని ప‌రిశీలించారు.. భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement