Friday, April 19, 2024

54 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి భూమి పూజ…

ఆలూరు : కర్నూలు జిల్లా ఆలూరు పట్టణము నందు శ్రీ బెళ్లిగుండు ఆంజనేయ స్వామి ముఖ – ద్వారం వద్ద సుమారు రూ.80 లక్షలు వ్యయంతో 54 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దివ్య విగ్రహం కొరకు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహం నిర్మాణానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, జ‌డ్పీటీసీ ఏరూరు శేఖర్ మండల కన్వీనర్ వీరేష్, ఎంపీపీ తనయుడు దీపక్, నారాయణరెడ్డి, మాదన్న, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవాలయం అభివృద్ధి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement