Saturday, April 20, 2024

ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వం… బీజేపీ యువ సంఘ‌ర్ష‌ణ యాత్ర..

కర్నూలు : ఆజాదిక అమృత్ మహోత్సంలో భాగంగా మహనీయుల విగ్రహాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి శుభ్రం చేశారు. రాయలసీమ వ్యాప్తంగా చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర (బైక్ ర్యాలీ) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు స్థానిక వన్ టౌన్ నందున్న జమ్మి చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు , బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ యాత్రకు స్వాగతం పలుకుతారు. అనంతరం పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement