Tuesday, April 23, 2024

వెల‌మ‌కూరులో వైసిపి, టిడిపి వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌…. గ్రామంలో ఉద్రిక్తత‌..

దేవనకొండ మండలం, వెలమకూరు గ్రామంలో టిడిపి, వైసిపీ వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుకుంది.. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత ప‌రిస్థితులు త‌లెత్తాయి.. కాగా గ్రామంలో దేవర జరుగు తోంది.. దీనిని తిల‌కించేందుకు డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అక్క‌డికి చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఈ యాత్రలో టీడీపీ, వైసీపీ శ్రేణులు కలవడంతో ఘర్షణ ప్రారంభమైంది. గ్రామంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. ఒకరికొకరు పరస్పరం దాడులకు దిగడంతో మరింత ఉద్రిక్తతకు కారణమైంది. స్థానికంగా ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అద‌న‌పు బ‌ల‌గాల‌ను ర‌ప్పించి పోలీసులు ప‌రిస్థితిని అదుపు చేశారు.. దాడుల నేపథ్యంలో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement