Thursday, March 28, 2024

ట్రాక్ట‌ర్ ని డీ కొన్న కారు.. ఒక‌రు మృతి

పాణ్యం( ప్రభ న్యూస్) : ట్రాక్ట‌ర్ ని కారు ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో కారు య‌జ‌మాని బాల‌రాజు మృతి చెందాడు. అత‌ని వ‌య‌సు 30సంవ‌త్స‌రాలు. ఈ సంఘ‌ట‌న నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్ నుండి తిరుపతి వెళుతున్న కారు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను అతివేగంతో అదుపుతప్పి ఢీకొంది.
కారు డ్రైవరు నిజాంపురం వినీత్ , సుద్ధ గొని ప్రేమ్, గొల్లపల్లి అభిలాష్, ట్రాక్టర్ డ్రైవర్ మధులను చికిత్స నిమిత్తం శాంతిరాం ఆసుప‌త్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధాకర్ రెడ్డి హైవే పెట్రోల్ వాహనం.. హెడ్ కానిస్టేబుల్, నేషనల్ హైవే టోల్గేట్ సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కారులో ఉన్న నలుగురు సంగారెడ్డి హైదరాబాద్ కి చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement