Friday, April 19, 2024

పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించండి: మంత్రి బొత్సకు మేయర్ విజ్ఞ‌ప్తి

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కర్నూలు మేయర్ బి.వై. రామయ్య కలిశారు. ముందుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తిరిగి స్థానం సంపాదించుకున్నందుకు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కర్నూలు నగరంలో నాడు – నేడు పథకం కింద ఇంకా అభివృద్ధి చేయాల్సిన మున్సిపల్ మరియు ప్రభుత్వ పాఠశాలు, పలు పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, పలు వార్డులో నూతన ప్రాథమిక పాఠశాల నిర్మాణాల గురించి మంత్రి మేయర్ క్లుప్తంగా వివరించి, వినతిపత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement