Friday, April 26, 2024

క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని వ‌చ్చేసింది.. అఫీషియల్​గా అనౌన్స్​ చేయొద్దన్న మంత్రి సురేశ్

ఆంధ్రప్రదేశ్​లో మూడు రాజ‌ధానుల విష‌యంపై మంత్రి ఆదిమూల‌పు సురేశ్ సోమ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని వ‌చ్చేసింద‌ని చెప్పారు. ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పకూడదనుకున్నా.. కానీ, క‌ర్నూలుకు జ్యుడిషియ‌ల్ కేపిట‌ల్ వ‌చ్చేసింది అని అన్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ఇప్పుడే ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని కూడా మంత్రి సురేశ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఆగ‌స్టు 15వ తేదీ త‌ర్వాత ఏపీలో ఊహించ‌ని ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయ‌న్నారు.

కాగా, ఏపీలో ఏం జ‌ర‌గ‌బోతోందో మీరే చూస్తార‌ని కూడా మంత్రి ఆదిమూలపు సురేశ్​ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తి చుట్టూ అభివృద్ధి అని గ్రాఫిక్స్ చూపిస్తూ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. ఓ సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే అభివృద్ధి జ‌రిగేలా పక్కాగా ప్లాన్​ చేశార‌ని పేర్కొన్నారు. అందుకే వికేంద్రీక‌ర‌ణ మంత్రంతో అభివృద్దితో పాటు పాల‌న కూడా అన్ని ప్రాంతాల‌కు విస్త‌రిస్తున్నామ‌ని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement