Friday, April 26, 2024

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న విజయవాడ నగరంలోని మారుతీనగర్‌లో చోటుచేసుకుంది. మాచవరం మారుతీనగర్‌లో ఆకునూరి లిడియా అనే యువతి ఒంటిరిగా ఉంటోంది. డోర్నకల్ రోడ్డులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఆమె పనిచేస్తోంది. ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ గదిలో లిడియా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేర‌కుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. లిడియా స్వస్థలం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కనుమోలుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement