Thursday, April 25, 2024

కాల్ మ‌నీ మాఫియా వేధింపుల‌తో వీఆర్వో ఆత్మ‌హ‌త్య

కాల్ మ‌నీ వేధింపుల వ్య‌వ‌హారంతో వీఆర్వో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొండపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ఆయన.. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పుగా తీసుకున్నాడు.

అప్పులు చెల్లిస్తూ వ‌స్తున్న‌ప్ప‌టికీ ఇంకా అప్పులు చూపించ‌డంతో.. ఆ మాఫియా వేధింపుల‌తో చేసేదేమీ లేక .. కాల్‌ మనీ మాఫియా చిత్రహింసలు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ లెటర్‌ రాసి.. గౌస్ కొండపల్లిలో తాను నివాసముంటున్న అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో అత‌ని కుటుంబ స‌భ్యులు వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement