Saturday, March 16, 2024

విజయవాడలో.. విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..

విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను భారీ మోసం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో చోటుచేసుకుంది. డయల్ ఇన్ స్టిట్యూట్ మోసం ఘటన విజయవాడలో వెలుగుచూసింది. బందరు రోడ్డులోని ఆఫీసు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు వల వేశారు. ప్రభుత్వ, విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల టోకరా వేశారు. 30మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్టిట్యూట్ యజమాని సిద్ధార్థ్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement