Thursday, April 18, 2024

ఆన్ లైన్ లో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ సేవ‌లు .. మంత్రి జ‌య‌రాం..

విజయవాడ: ఢిల్లీ తరువాత విజయవాడ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలోనే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. విజయవాడ గుణదలలో ఆధునీకరించిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీని మంత్రి గుమ్మనూరి జయరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్పెన్సరీలో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. రోగి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని సౌకర్యాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement