Thursday, April 25, 2024

రేపు నెమలి కృష్ణయ్య కల్యాణం


గంపలగూడెం, నెమలి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రికి రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగతుందని ఆలయ సహాయ కమిషనర్ నేల సంధ్య శనివారం తెలిపారు. శ్రీ వేణుగోపాల స్వామి వారు మంగళవాయిద్యాలతో ఛత్రచామరాది ఆందోళికలతో భజన మేళ తాళములతో తిరువీధుల్లో వేంచేస్తూ కళ్యాణమండపం ప్రవేశించి రాత్రి 10 గంటలకు శ్రీమాన్ పరాశరం వేంకట రమణాచార్యులు పర్యవేక్షణలో,ఆలయ ఉప ప్రధానార్చకులు టి.గోపాలాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం సకలజన నయనానందకరముగా కళ్యాణం జరగనుందని,కార్యక్రమంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement