Thursday, April 25, 2024

Breaking: కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు

కృష్ణానదిలో ముగ్గురు గల్లంతైన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం చోడవరం దగ్గర చోటుచేసుకుంది. సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన రహీం భాషా, జారా రెస్టారెంట్ నడుపుతున్నారు. గల్లంతైన వాళ్ళు రహీం భాష ఆయన స్నేహితులు. అయితే గల్లంతైన వారిలో జాన్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. నిన్న రహీంకు చెందిన స్కార్పియో వాహనంలో చోడవరం నదీ తీర నిర్మానుస్య ప్రాంతానికి వెళ్లి మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మద్యం మత్తులో స్నానానికి దిగి గల్లంతై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా ఏర్పడిన ఊబిలో చిక్కుకున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురిలో ఒకరు ఖలేశావళి అలియాస్ పండు. మృతదేహాల కోసం పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement