Friday, April 19, 2024

గుడివాడలో ఉద్రిక్త వాతావరణం

కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని తెదేపా నిజనిర్ధార‌ణ కమిటీ శుక్రవారం పరిశీలించిన‌ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో కొడాలి కన్వెన్షన్ సెంటర్‌కు భారీగా వైకాపా శ్రేణులు చేరుకుంటున్నాయి. కమిటీ సభ్యులుగా నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్య ఉన్నారు. పూర్తిస్థాయి నివేదికను తెదేపా అధిష్ఠానానికి కమిటీ అందజేయనున్నది. కొడాలి కన్వెన్షన్ సెంటర్ నందు పోలీసు ఉన్నతాధికారులతో గుడివాడ వైసీపీకి చెందిన అడపా బాబ్జి, పాలేటి చంటి, గొర్ల శ్రీను తదితర ప్రధాన నేతలు చర్చలు జరిపారు. నూతన తన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. మరోవైపు గుడివాడలో క్యాసినో నిర్వహణపై బొండా ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెదేపా నేతల గుడివాడ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement