Tuesday, April 23, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జి.కొండూరు మండలం మునగపాడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరి (28) అనే వివాహిత స్కూటీపై పొందుగల నుంచి మునగపాడు వెళ్తుండగా గుర్రాజుపాలెం పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమకాలికి తీవ్ర గాయమైంది. కొండపల్లి నుంచి వస్తున్న ఎపి 16 టి.ఎల్ 0199 అనే నెంబర్ గల ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను పోలీసు వాహనంలో మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement