Saturday, April 20, 2024

విజయవాడ సమీపంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

విజయవాడ సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కండ్రిక సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. రహదారి నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన జాకీలను వారి వాహనం ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక యువకుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. యువకులు కండ్రిక నుంచి పాతపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను వాంబేకాలనీకి యువకులుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement