Friday, March 29, 2024

కృష్ణాలో పోలింగ్ ప్రశాంతం..

ఎ. కొండూరు – జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు. గురువారం మండలంలోని గొల్ల మండల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా గట్టి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మండలం లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని సంతృప్తి వ్యక్తం చేశారు. వీరితో పాటు నూజివీడు డి.ఎస్.పి బి. శ్రీనివాసులు, మైలవరం సి ఐ పి. శ్రీను, ఎస్ ఐ కె ప్రతాప్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, సర్పంచ్ దాడి సరిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement