Wednesday, April 24, 2024

విజయవాడ: పార్క్ చేసిన కారులో డెడ్‌బాడీ కలకలం

విజయవాడ నగరంలో రోడ్డుపక్కన ఆగి ఉన్న కారులో డెడ్‌బాడీ కలకలం రేపింది. మాచవరం పార్క్ చేసిన కారులో మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని తాడిగడపకు చెందిన రాహుల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు జి.కొండూరులోని జిక్సిన్ సిలిండర్స్ కంపెనీకి యజమాని అని పోలీసులు వెల్లడించారు.

వ్యాపార పనుల నిమిత్తం అరగంట లేదా గంట సమయంలో తిరిగి వస్తానని చెప్పి ఎంతకీ రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఉదయం పోలీసులకు మాచవరం సమీపంలో కారులో డెడ్ బాడీ కన్పించింది. కాగా రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా ఆయనను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కొత్త కారు కావడంతో బుధవారం సాయంత్రం ఇంటి నుండి బయలుదేరిన రాహుల్ ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయమై కూడా పోలీసులు టెక్నికల్ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.కారు అద్దాలు పగులగొట్టడం కంటే కారు షోరూం నుంచి నిపుణులను తీసుకొచ్చి కారు డోర్స్ ఓపెన్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: యువతుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం

Advertisement

తాజా వార్తలు

Advertisement