Saturday, April 20, 2024

పెడ‌న మాజీ ఎమ్మెల్యే,టిడిపి సీనియ‌ర్ నేత కాగిత వెంక‌ట‌రావు క‌న్నుమూత‌…

పెడన : పెడన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియ‌ర్ నేత కాగిత వెంకట్రావు(71) విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న కాగిత మచిలీపట్నం అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ హార్ట్ ఎటాక్ రావడంతో ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచారు. ఒకప్పటి మల్లేశ్వరం నియోజకవర్గం, ఇప్పటి పెడన నియోజవర్గం కు ఎమ్మెల్యేగా ఆయన పలు దఫాలు పనిచేశారు. మాజీ చీఫ్ విప్ గా, రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా కూడా గతంలో ఆయన పనిచేశారు. కాగిత వెంకట్రావు కుమారుడు కృష్ణ ప్రసాద్ రాజకీయాల్లో ఉండగా, కుమార్తె వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, విద్యావేత్తలు, అధికారులు సంతాపం తెలియజేశారు. కాగా కాగిత మృతి ప‌ట్ల టిడిపి అధినేత చంద్ర‌బాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్ లు సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement