Wednesday, April 24, 2024

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం

ఎ. కొండూరు – కారు – ఆటో ఢీకొన్న ప్ర‌మాదంలో వృద్ధురాలు మ‌ర‌ణించ‌గా, మ‌రో 10 మంది గాయ‌ప‌డ్డారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన మూడు బాలి (70) ఆరోగ్యం బాగా లేనందున శనివారం కంభంపాడు ప్రైవేట్ వైద్యుని వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే నిమిత్తం కంభంపాడు మెయిన్ సెంటర్ లో ఆగివున్న ప్రయాణికులఆటోఎక్కి వెళుతుండగా మైలవరం వైపు నుండి అతివేగంగా వెళుతున్న కారు ఆటోను వెనకవైపు భాగాన ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న బాలి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో పదిమందికి తీవ్ర గాయాలై నట్లు ఎస్ ఐ కె. ప్రతాప్ రెడ్డి తెలిపారు. క్షతగాత్రులను వైద్య పరీక్షల నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ఆటోల ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement