Saturday, April 20, 2024

మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కు కలెక్టర్ గా ప‌దోన్న‌తి

విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కలెక్టర్ గా ప‌దోన్న‌తి పై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఆగస్టులో ప్రసన్న వెంకటేష్ విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రసన్న వెంకటేష్ విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించరానే పేరుంది. సౌమ్యుడిగా వ్యవరిస్తూనే తనదైన శైలిలో అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ విషయంలో నగర ప్రజలకు విస్తృతమైన సేవలందించారు. విజయవాడ నగరాన్ని జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ లో మూడో స్థానాన్ని సాధించి రాష్ట్రపతి రామానాధ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఘనత ఆయనకు దక్కింది. ప్రసన్న వెంకటేష్ స్థానంలో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ గా సీసీఎల్ ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న పి రంజిత్ భాష ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement